
జనరల్

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో నది మధ్యలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వరదల కారణంగా ఆలయానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఎడతెరిపి లేని వర్షాలతో నది ఉప్పొంగి పరిసర ప్రాంతాల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
వరద నీటిలో మట్టి కలిసిపోవడంతో నీరు ఎర్రగా మారి పట్టిసీమలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం ముందు భాగంలో ప్రవహిస్తోంది. అదే సమయంలో ఆలయం వెనుక వైపు నుంచి వచ్చే మరో ప్రవాహం సహజ నీలిరంగులో కొనసాగుతోంది. ఈ రెండు ప్రవాహాలు గూటాల సమీపంలో కలవడంతో గోదావరి రెండు రంగుల్లో ప్రవహిస్తూ అరుదైన దృశ్యాన్ని సృష్టిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!