
జనరల్

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై విద్యుత్ స్తంభం విరిగి పడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. వరి పొట్టు తీసుకెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగలడంతో స్తంభం విరిగి కూలిపోయినట్లు సమాచారం.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!