
జనరల్

ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ పైవంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని, ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రూ.10,410 కోట్ల వ్యయంతో విజయవాడ వరకు ఆరు వరుసల రహదారి, రెండు లేన్ల సర్వీస్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా తొర్రూర్లో రూ.338 కోట్లతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో నాలుగు లేన్ల రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రహదారి, బుల్లెట్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్ధమైందని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో మరో మూడు రహదారులకు రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!