
జనరల్

విశాఖపట్నంలోని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక సింహాచలం గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం తొలిపావంచ నుంచే భక్తులు సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఈసారి సుమారు 8 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 50 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతుండగా, ట్రాఫిక్ నియంత్రణ కోసం కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు, రేపు స్వామివారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. విశాఖ జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భద్రత, వైద్య సదుపాయాలు, తాగునీరు, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!