

వెట్టిచాకిరీ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, బాండెడ్ లేబర్ సిస్టమ్ (రద్దు) చట్టం–1976 అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా షామీర్పేటలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, ఐజేఎం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ సభ్య కార్యదర్శి చి. పంచాక్షరి, నల్సార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణదేవరావు కలిసి "స్వేచ్ఛా రథం" అనే ప్రత్యేక అవగాహన వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటిస్తూ వెట్టిచాకిరీపై ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించనుంది.
సదస్సులో ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బాధితులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. వెట్టిచాకిరీ బాధితులను గుర్తించడం, రక్షించడం, పునరావాసం కల్పించడం కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వక్తలు నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీపై రూపొందించిన ప్రత్యేక అవగాహన గీతాన్ని విడుదల చేయడంతో పాటు, బాండెడ్ లేబర్ చట్టం 50 ఏళ్ల స్మారక గ్రంథం, ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ హెల్ప్లైన్ పోస్టర్ను ఆవిష్కరించారు. వెట్టిచాకిరీ నుంచి బయటపడి ప్రస్తుతం గ్రామ సర్పంచ్గా ఉన్న పీ. లింగమ్మ తన అనుభవాలను పంచుకుంటూ బాధితులకు అండగా నిలుస్తానని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!