

హైదరాబాద్ భారత్లో అంతర్భాగంగా మారడానికి ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాలు కారణమయ్యాయని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు రాధాకృష్ణన్ తెలిపారు. వారి పోరాటాలు, త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరించారు. వేడుకల్లో తెలంగాణ కళారూపాలు, వేయిస్తంభాల గుడి, బతుకమ్మ తదితర అంశాలతో కూడిన శకటాలను ప్రదర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!