
జనరల్

విమాన టికెట్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు, అదనపు ఛార్జీలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌర విమానయాన రంగాన్ని ఆధునికీకరించేందుకు రూపొందించిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద తీసుకొచ్చిన కొత్త నిబంధనలను రెండు వారాల్లోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ నిబంధనలను సీల్డ్ కవర్లో సమర్పించాలని సూచించింది.
ఈ నిబంధనలను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వేరు, కోర్టుకు సమర్పించడం వేరు అని స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!