

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన ఉద్యోగుల కోసం కఠినమైన పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. పాలన, పారదర్శకత, నైతిక ప్రమాణాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టింది. ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లిన తర్వాత రెండు సంవత్సరాల పాటు సెబీ ముందు లేదా వ్యతిరేకంగా వాదనలు వినిపించరాదని పేర్కొంది. మాజీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ సమీక్ష జరిగింది.
కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనుమతి లేని పెట్టుబడుల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టకూడదు. అయితే నియంత్రిత పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వాహనాలు, ఇన్విట్లు, రీట్స్ ద్వారా పెట్టుబడులకు అనుమతి ఉంది. రూ.50,000 కంటే ఎక్కువ బహుమతులను వెల్లడించాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ మార్పుల చర్చలు కూడా నెలలోపు తెలియజేయాలి. దీనికి సెబీ డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!