

ప్రభుత్వ కోటాలో అండర్గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశం పొందే ముస్లిం మహిళలకు పూర్తి ట్యూషన్ ఫీజు మద్దతు అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, వ్యవసాయం, న్యాయ కోర్సుల్లో చదివే విద్యార్థినులకు ఈ పథకం వర్తించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ కోటా ద్వారా ప్రవేశం పొందిన వారికి ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం కోసం తొలుత రూ.20 కోట్లు కేటాయించారు.
మహిళలు, మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలను ప్రకటించింది. పాఠశాల బాలికలకు స్కాలర్షిప్లను విస్తరించడంతో పాటు చెన్నైలో కొత్త మహిళా కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. మైనారిటీ వర్గాలకు చెందిన ఆస్తుల కోసం వడ్డీ లేని ఆర్థిక సహాయం, యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కూడా అమలు చేయనుంది. విద్య, ఉపాధి అవకాశాలను పెంచి మహిళలు, యువత ఆర్థికంగా మరింత సాధికారత సాధించేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!