

హైదరాబాద్కు చెందిన భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ సాధారణ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా పేస్ విభాగంలో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుటుంబం అందించిన ప్రోత్సాహంతో క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకున్న సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా గతంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రముఖ గాయని ఆశా భోస్లే మనవరాలు, గాయని జనై భోస్లేతో సిరాజ్ కలిసి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. అయితే సిరాజ్, జనై ఇద్దరూ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ తమ మధ్య ఉన్నది అన్నాచెల్లెళ్ల అనుబంధమే అని స్పష్టం చేశారు.
రాఖీ పండుగ సందర్భంగా జనై భోస్లే మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సిరాజ్కు రాఖీ కడుతున్న పాత ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. ‘మనం ఎంచుకున్న బంధం ఇది. నాకు ఇంత మంచి అన్నయ్య దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను రక్షించే వ్యక్తి, నా ప్రాణ స్నేహితుడు’ అంటూ భావోద్వేగ సందేశాన్ని రాసింది. ఇన్స్టా స్టోరీలోనూ అదే ఫొటోను షేర్ చేస్తూ.. ఫొటో కింద ఉన్న సందేశాన్ని చదవాలని సూచించింది. గతంలో తమపై వచ్చిన వదంతులకు ఈ పోస్ట్ ద్వారా మరోసారి సమాధానం ఇచ్చినట్లు కనిపించింది. ఆశా భోస్లే మరణించిన సమయంలోనూ సిరాజ్ ముంబైకి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొని జనైకి మద్దతుగా నిలిచాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!