
జనరల్

హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియపై కమిటీ విస్తృతంగా చర్చించింది.
ఇప్పటికే విద్యార్థి ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజాసంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులతో కమిటీ పలుమార్లు సంప్రదింపులు జరిపింది. ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం, ఉద్యమకారుల గుర్తింపునకు అవసరమైన ప్రమాణాలపై వచ్చిన సూచనలు, సలహాలను సమావేశంలో సమీక్షించారు. వీటి ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి, త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కమిటీ సమావేశం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!