

తెలంగాణలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలకు ఆధునిక, పారదర్శక, సాంకేతికత ఆధారిత నియంత్రణ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనను ప్రారంభించింది. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ పాలసీ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, వాహన యజమానులు, ప్రయాణికుల ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు మరియు ప్రభుత్వ శాఖలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించింది.
ఈ పాలసీలో ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, వాహనాల ఫిట్నెస్, పర్మిట్లు, బీమా, డిజిటల్ మానిటరింగ్, ఛార్జీలలో పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, మహిళా ప్రయాణికులు మరియు మహిళా డ్రైవర్ల భద్రత, ప్రభుత్వ శాఖల మధ్య డేటా సమన్వయం, ఎలక్ట్రిక్ మరియు పర్యావరణహిత వాహనాల ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుండగా, దాని ఆధారంగా తెలంగాణలో సమగ్ర అగ్రిగేటర్ పాలసీ అమలుకు ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!