
జనరల్

తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆసరా పింఛన్ల మంజూరుకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘చేయూత’ పింఛన్లలో తొలి విడతలో ఏడు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అర్హత ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.
గతంలోనే పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హుల గుర్తింపు, దరఖాస్తుల పరిశీలన, పింఛన్ల మంజూరు ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు తాజా మార్గదర్శకాలు రూపొందించారు. ‘చేయూత’ పింఛన్ల మంజూరుకు సంబంధించి సెర్ప్ సీఈఓ సర్క్యులర్ జారీ చేసి సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!