
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉద్రిక్త వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రామ మందిర విరాళాల దుర్వినియోగంపై లోక్సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ అంశంపై చర్చ జరిపేందుకు సాధారణ కార్యకలాపాలను నిలిపివేయాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అయోధ్య అంశం, నీట్ పరీక్షపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. క్వశ్చన్ అవర్ సమయంలో నినాదాలు చేయడం సరికాదని స్పీకర్ సూచిస్తూ, సభ్యులు సభా మర్యాదలు పాటించాలని కోరారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!