
క్రీడలు

రష్యాకు రక్షణ సాంకేతికత, యంత్ర పరికరాలు సరఫరా చేశారన్న ఆరోపణలతో గతంలో నాలుగు భారత కంపెనీలపై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా తొలగించింది. ఇందులో హైదరాబాద్కు చెందిన ఆర్ఆర్జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్, లోకేశ్ మెషీన్స్తో పాటు అహ్మదాబాద్కు చెందిన గేలక్సీ బేరింగ్స్, ఢిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ సంస్థలు ఉన్నాయి.
ఆర్ఆర్జీ సంస్థపై మైక్రో ఎలక్ట్రానిక్స్ సరఫరా ఆరోపణలు ఉండగా, లోకేశ్ మెషీన్స్పై రక్షణ ఉత్పత్తి యంత్రాల సరఫరా ఆరోపణలు వచ్చాయి. గేలక్సీ బేరింగ్స్పై రోలర్ బేరింగ్స్ ఎగుమతి ఆరోపణలు, శౌర్య ఏరోనాటిక్స్పై రాడార్, నావిగేషన్ పరికరాల విక్రయాల ఆరోపణల నేపథ్యంలో ఆంక్షలు విధించబడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!