
సినిమాలు

తమిళనాడులో 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాన తెలుగు, జాతీయ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ‘సింగపెణ్’ టాస్క్ఫోర్స్, 717 టాస్మాక్ దుకాణాల మూసివేత వంటి నిర్ణయాలను ఈ ప్రకటనల్లో ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అయితే తమిళనాడు బడ్జెట్ నిధులతో పక్క రాష్ట్రాల మీడియాలో ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. శాంతిభద్రతలు, విద్యుత్ కోతలు, కొత్త మంత్రుల అనుభవరాహిత్యం వంటి క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల తరహాలో తాత్కాలిక ప్రచార హైప్ రాజకీయాల్లో ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నగా మారింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!