

ఇరాన్తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు తగ్గుతుండటంతో రక్షణశాఖ అప్రమత్తమైంది. ఆయుధ ఉత్పత్తిని వేగంగా పెంచాలని తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది. రక్షణశాఖ ఉప మంత్రి స్టీవ్ ఫీన్బెర్గ్ ఆయుధ కంపెనీలు మూడు వారాల్లోగా ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచే ప్రణాళికలను సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. కీలక రక్షణ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవాలని, ఇందుకు ఏళ్ల సమయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సైనికులకు అవసరమైన ఆయుధ నిల్వలను పునరుద్ధరించడం తమ ప్రాధాన్యాల్లో ఒకటని పెంటగాన్ ప్రతినిధి సియాన్ పార్నెల్ తెలిపారు.
ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునే అధునాతన గగనతల రక్షణ ఆయుధాల నిల్వలు తగ్గిపోవడం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. పేట్రియాట్, థాడ్ ఇంటర్సెప్టర్ల సంఖ్య యుద్ధానికి ముందు స్థాయితో పోలిస్తే గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిల్వలు మరింత తగ్గితే అమెరికా, దాని మిత్రదేశాలు గగనతల రక్షణ క్షిపణులను ఆచితూచి వినియోగించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆయుధాల కొరతపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్నంగా స్పందిస్తున్నారు. అమెరికా వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నాయని, అవసరమైనప్పుడు నౌకల ద్వారా తరలించేందుకు మరిన్ని ఆయుధాలు తయారవుతున్నాయని ఆయన చెబుతున్నారు. ఇదే సమయంలో రక్షణ బడ్జెట్ను భారీగా పెంచే ప్రతిపాదనపై అమెరికా కాంగ్రెస్లో ప్రతిబంధకాలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!