
రాజకీయాలు

పోక్సో కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల న్యాయవాదుల ద్వారా హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్ పిటిషన్పై కోర్టు ఇటీవల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ నేపథ్యంలో నేడు న్యాయమూర్తి తీర్పు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో హైకోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. తీర్పు వెలువడిన అనంతరం కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!