
జనరల్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రిని అసభ్యకరంగా దూషించారని ఆరోపిస్తూ, సంబంధిత ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగచర్ల గోపాల్ రెడ్డి, రాష్ట్ర బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు యాదవ్, రాష్ట్ర మీడియా ప్యానలిస్టు పసుపులేటి సురేష్, తిరుపతి నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు రమణారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. చట్ట ప్రకారం సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!