

అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్పై చాలా కాలంగా చర్చ నడుస్తోంది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనతో కథా చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అక్కినేని నాగార్జున స్వయంగా ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపడంతో అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధమైన తుది కథపై నాగచైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, రద్దు విషయంపైనా చిత్రబృందం మౌనం పాటిస్తోంది. ఇదిలా ఉండగా అక్కినేని హీరోలు ఇప్పుడు తమ తమ ప్రాజెక్ట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నాగచైతన్య ‘ధూత 2’తో పాటు దర్శకుడు క్లాక్స్ ప్రాజెక్ట్ మరియు మరో హారర్ చిత్రానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. మరోవైపు అఖిల్ కూడా కొత్త కథలపై చర్చలు జరుపుతూ త్వరలోనే తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేయనున్నాడట. ఇక నాగార్జున ‘కింగ్ 100’ విడుదల పనులను పూర్తి చేసి, దసరా తర్వాత మరో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!