

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్’పై దృష్టి సారించారు. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన కుమార్తె సుహానా ఖాన్తో పాటు దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్వెల్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కింగ్’ పూర్తయిన తర్వాత షారుఖ్ ఖాన్ టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఓ భారీ ప్రాజెక్ట్లో నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కథ నచ్చడంతో షారుఖ్ ఈ ప్రాజెక్ట్కు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ అగ్ర దర్శకుడు ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షారుఖ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ నిజమైతే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!