

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అనంతరం ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్ర ప్రెజెంటేషన్పై వచ్చిన విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సనా కొన్ని సన్నివేశాలను ఇప్పటికే తొలగించినట్లు వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ శనివారం నుంచి ‘పెద్ది’ చిత్రంలో మరికొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే సిసోడియా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త సన్నివేశాలను జోడించనున్నట్లు తెలుస్తోంది. కథనం మరింత బలంగా ఉండేలా ఈ మార్పులు చేపడుతున్నారని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మార్పులు సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!