

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న జై హనుమాన్ సినిమాపై మరో ఆసక్తికర ప్రచారం మొదలైంది. ఇప్పటికే రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు అశ్వద్ధామ పాత్ర కోసం రానా దగ్గుబాటిని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
హనుమాన్ ఘన విజయానంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. కథలో అశ్వద్ధామ పాత్రకు కీలక ప్రాధాన్యం ఉండనున్న నేపథ్యంలో రానా పేరు వినిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నటీనటుల ఎంపికపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (1)
Wow