
సినిమాలు

రణ్బీర్ కపూర్ కెరీర్లోనే అత్యంత కీలకమైన దశకు చేరుకుంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న ఆయన ఒక్కో సినిమాకు సుమారు రూ.100–150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఆయన మార్కెట్ విలువ, బాక్సాఫీస్ స్టామినా మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
ఇక రణ్బీర్ రెండు భారీ సీక్వెల్స్ యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర 2లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 మధ్య నుంచి ఈ రెండు చిత్రాల షూటింగ్లను చేపట్టే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. విభిన్నమైన కథా ప్రపంచాలకు చెందిన ఈ రెండు సినిమాల్లో వరుసగా పనిచేయడం ఆయన నటనా వైవిధ్యాన్ని మరోసారి చూపించనుంది. అయితే పారితోషికం, షూటింగ్ షెడ్యూల్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!