
ఓటీటీ

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి 155 నిమిషాల రన్టైమ్ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విడుదల సమయం దగ్గరపడడంతో ప్రముఖ టికెట్ బుకింగ్ వేదికల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
సి. అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు పిక్చర్స్, వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్లపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!