

భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల కల్కి 2898 ఏడీలో కీలక పాత్రతో ప్రశంసలు అందుకున్న ఆయన, త్వరలో ఆ చిత్ర సీక్వెల్లోనూ కనిపించనున్నారు. దాదాపు 25 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కొనసాగుతున్న అమితాబ్ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటున్నారు. తాజాగా తన సినీ ప్రయాణం ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ, ఒకేసారి 10 నుంచి 15 సినిమాల్లో నటించిన అనుభవాలను, ఆ నిర్ణయాల వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. అలాగే నేటి తరం నటీనటుల అంకితభావాన్ని ప్రశంసించారు.
తమ కాలంలో ఒకే రోజులో రెండు, మూడు సినిమాల షూటింగ్లలో పాల్గొనాల్సి వచ్చేదని అమితాబ్ చెప్పారు. అప్పట్లో పాత్రల కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యే అవకాశం ఉండేది కాదని, దర్శకులు చెప్పినట్లే వెంటనే కెమెరా ముందుకు వెళ్లి నటించేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఒకేసారి ఎన్నో సినిమాలు చేయడానికి ప్రధాన కారణం అవకాశాలు కోల్పోతామనే భయమేనని తెలిపారు. నిరుద్యోగులమైపోతామనే ఆందోళనతో ప్రతి అవకాశాన్ని నిజాయితీగా స్వీకరించి, తమ వంతు కృషి చేసేవాళ్లమని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!