
సినిమాలు

2023లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్', సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదలై భారీ చర్చకు దారితీశాయి. అయితే రీమేక్గా వచ్చిన 'భోళా శంకర్' ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోగా, 'జైలర్' బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఆ పోటీలో రజనీకాంత్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు.
ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'జైలర్ 2'ను అక్టోబర్ 15న, చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర'ను అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ తేదీలు ఖరారైతే మరోసారి సౌత్ సినీ అభిమానులకు ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ చూడబోతున్నారు. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!