

టాలీవుడ్ యంగ్ హీరో రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో, ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రాశి, ప్రిన్స్ సెసిల్, అన్య, చరిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 25న గ్రాండ్గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే సెప్టెంబర్ 24న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ విడుదల కానుండటంతో మరుసటి రోజే ‘అనుమాన పక్షి’ బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది. ఈ పోటీపై స్పందించిన చిత్రబృందం.. “బరిలో కాకి ఉందని పక్షి ఎగరడం ఆపదు” అంటూ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీపై ఆసక్తి పెరిగింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!