

బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను సోమవారం నుంచి ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మొదట బాలయ్య తన ఇంట్లోనే డబ్బింగ్ చెప్పనున్నారు. ఇందుకోసం ఆయన ఇంట్లో ప్రత్యేక డబ్బింగ్ సెటప్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు పూర్తైన షూటింగ్ భాగానికి బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నారని తెలుస్తోంది. మిగిలిన చిత్రీకరణను కూడా వేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందట.
ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్లో బాలయ్యను రాజు పాత్రలో చూపించడంతో కథపై ఆసక్తి పెరిగింది. బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డబ్బింగ్ పనులు మొదలుకానుండటంతో త్వరలోనే సినిమా తదుపరి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!