

‘కాక్టెయిల్ 2’ చిత్రంలో తనతో కలిసి నటించిన కృతి సనన్తో పోటీ ఉందన్న ప్రచారాన్ని నటి రష్మిక మందన్న ఖండించారు. ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తే వారి మధ్య విభేదాలు ఉంటాయనే భావన పాతదైపోయిందని, అలాంటి అపోహలను పూర్తిగా వదిలేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కృతితో కలిసి పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేక అనుభవమని, ఈ సినిమా తనకు ఒక మంచి స్నేహితురాలిని అందించిందని రష్మిక తెలిపారు.
‘కాక్టెయిల్ 2’ షూటింగ్ సమయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాతావరణమే ఎక్కువగా కనిపించిందని ఆమె చెప్పారు. షూటింగ్ విరామాల్లో కలిసి సమయం గడపడం, భోజనం చేయడం, ఒకరి నటనను మరొకరు అభినందించుకోవడం వల్ల మంచి అనుబంధం ఏర్పడిందని వెల్లడించారు. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 19న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!