

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయనున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్రబృందం సినిమా విశేషాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా హీరోయిన్ వితికా షేరు, నటులు సుమన్, నటరాజ్, కస్తూరి, సంగీత దర్శకుడు మహావీర్ ఎల్లంధర్, దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మేరుం భాస్కర్ తదితరులు మాట్లాడారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే పర్పస్ఫుల్ మూవీగా సినిమా తెరకెక్కిందని వారు తెలిపారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్రబృందం కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!