

ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదంపై వాహనం నడిపిన లింగమనేని సంజుష్ తన వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి పారిపోలేదని, గాయపడిన భారతి ముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్య సహాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, అయితే చికిత్స పొందుతూ భారతి ముఖి మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ప్రమాదం అనంతరం తాను స్వయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి అధికారులకు ఘటన వివరాలను వెల్లడించానని సంజుష్ తెలిపారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. ప్రమాద సమయంలో తన శారీరక పరిస్థితిని నిర్ధారించేందుకు నిర్వహించిన బ్రీత్ అనలైజర్, యూరిన్, బ్లడ్ పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తు, దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!