

బాలీవుడ్ నటి దియా మీర్జా వాతావరణ మార్పులు మరియు పితృస్వామ్య వ్యవస్థల మధ్య సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సోహా అలీ ఖాన్ నిర్వహించిన ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్కాస్ట్లో పాల్గొన్న దియా, ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావుతో కలిసి ఎకోఫెమినిజం అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వాతావరణ సంక్షోభం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, అది సామాజిక అసమానతలకు కూడా సంబంధించినదని ఆమె పేర్కొన్నారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుషాధిక్య వ్యవస్థలు ప్రకృతిని, బలహీన వర్గాలను దోపిడీకి గురిచేసే వనరులుగా చూసాయని దియా అన్నారు. మహిళలను ఎలా వస్తువుల్లా చూస్తారో, అడవులు మరియు నదులను కూడా అదే విధంగా చూసారని ఆమె వ్యాఖ్యానించారు. వరదలు, కరవులు వంటి ప్రకృతి విపత్తుల ప్రభావం మహిళలు, పిల్లలపై ఎక్కువగా ఉంటుందని, అయితే నిర్ణయాలు తీసుకునే స్థాయిలో వారికి తగిన ప్రాతినిధ్యం ఉండదని చెప్పారు. సమానత్వం, కరుణ, భాగస్వామ్య నాయకత్వంతోనే వాతావరణ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!