

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ఉపశమనం కల్పించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి ప్రకటించారు. దీంతో ఈ-కేవైసీ పూర్తికాక రేషన్ నిలిచిపోతుందనే ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరట లభించింది.
అదనంగా, ప్రజల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పొందే అవకాశం కల్పించారు. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు సమీప రేషన్ దుకాణాలను సంప్రదించి వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, నిర్ణీత గడువులో మూడు నెలల కోటా బియ్యాన్ని తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!