

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమా రెండో షెడ్యూల్ వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు భారీ సెట్ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సెట్లో శర్వానంద్పై పలు యాక్షన్ సీన్స్ను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై గతంలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. రెండో షెడ్యూల్లో శర్వానంద్, భాగ్యశ్రీ బోర్సేలపై లవ్ సీన్స్ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘విశ్వం’కు సగటు స్పందన రావడంతో, ‘జార్జ్ క్రిష్’తో మళ్లీ టాలీవుడ్లో బిజీ కావాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!