
సినిమాలు

‘పుష్ప 2’, ‘ఆవేశం’, ‘మారీసన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన 2027లో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న రెండు మలయాళ చిత్రాలను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండగా, వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఫహాద్ మాట్లాడుతూ కథ బలమే తనను ఈ ప్రాజెక్టులను ఎంచుకునేలా చేసిందన్నారు. ఒక నటుడిగా సవాళ్లు విసిరే, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమాల్లో భాగం కావడం తనకు ఎప్పుడూ ఇష్టమని తెలిపారు. రాబోయే ఈ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!