

కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, ‘దృశ్యం 3’ విజయానంతరం పనోరమా స్టూడియోస్, నిర్మాత జాకబ్ బాబుతో కలిసి రెండు కొత్త ఫీచర్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బలమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్టులు రూపొందనున్నాయి.
ఈ సినిమాల్లో నటించడానికి ప్రధాన కారణం కథలేనని ఫహద్ ఫాసిల్ తెలిపారు. విభిన్న పాత్రలు చేయడం తనకు ఎప్పుడూ ఇష్టమని, కొత్త అనుభూతిని అందించే కథల్లో భాగమవడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. పనోరమా స్టూడియోస్ అధినేత కుమార్ మంగత్ పాఠక్, నిర్మాత అభిషేక్ పాఠక్ కూడా ఫహద్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దర్శకులు, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!