

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్కు సంబంధించిన షూటింగ్ లేకుండా ఇతర కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. భుజానికి గాయం కావడంతో ఎన్టీఆర్ కొన్ని వారాల పాటు షూటింగ్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన అవసరం లేని పోర్షన్ను పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ దృష్టి పెట్టింది.
అయితే అక్టోబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ డ్రాగన్ సెట్స్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తారక్ పూర్తిగా కోలుకుని షూటింగ్కు సిద్ధమైన విషయాన్ని అభిమానులకు తెలియజేసేలా ఒక సింపుల్ అండ్ స్పెషల్ క్లిప్ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్. షూటింగ్లో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!