

తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మూదర్ కూడమ్’కు సీక్వెల్గా రూపొందుతున్న చిత్రం ‘మిషన్ పాజిబుల్’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని గ్రాండెల్ పిక్చర్స్ బ్యానర్పై సంకిత్ బోరా, కమల్ బోరా నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. నగరంలో డైనోసార్లు విధ్వంసం సృష్టించడం, వాటిని ఎదుర్కొనేందుకు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడం, శాంటాక్లాజ్ దుస్తుల్లో ఉన్న బొమ్మను వెంటాడుతూ ప్రధాన పాత్రలు పరుగెత్తడం వంటి విజువల్స్ పోస్టర్లో ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ను తలపించే ఈ పోస్టర్కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!