

ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్ను ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘అగధ’ ట్రైలర్ తాజాగా విడుదలై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంత్ర తంత్రాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథగా కనిపిస్తోంది.
"మంత్ర తంత్ర విద్యలకు అందని శక్తి ఉంది.. దాని గురించి నాకు తెలియాలి" అనే కామాక్షి భాస్కర్ల డైలాగ్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్, నేపథ్య సంగీతం, సస్పెన్స్ అంశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ట్రైలర్కు లభిస్తున్న స్పందనతో చిత్రబృందం విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!