

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో నిరాశ పరుస్తున్నారు. గత ఏడాది విడుదలైన ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ వంటి చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అయినప్పటికీ కథల ఎంపికలో వెనుకడుగు వేయని నితిన్, తాజాగా నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి నితిన్ రెమ్యూనరేషన్పై ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు సుమారు రూ. 5 కోట్ల వరకు తీసుకునే నితిన్, ఈ ప్రాజెక్ట్ కోసం తన పారితోషికాన్ని రూ. 4.5 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుస ఫ్లాపుల ప్రభావమా లేక నిర్మాతకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమా అనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా, నాని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాతో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!