
క్రీడలు

భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తన తొలి కక్ష్య ప్రయోగ వాహనం విక్రమ్-1 ద్వారా ముగ్గురు భారత మహనీయులకు విశిష్ట నివాళి అర్పించనుంది. సర్ సి.వి. రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ సూక్ష్మ బంగారు ప్రతిరూపాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారత శాస్త్ర, అంతరిక్ష రంగాలకు వారు అందించిన విశేష సేవలకు ఇది గుర్తింపుగా నిలవనుంది.
ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన స్కైరూట్, భారత అంతరిక్ష ప్రయాణానికి పునాది వేసిన మహనీయులకు ఇది తమ గౌరవ నివాళి అని పేర్కొంది. తొలి కక్ష్య ప్రయోగానికి సిద్ధమవుతున్న విక్రమ్-1 మిషన్ భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుండగా, దేశ శాస్త్ర వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!