

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రియాంక చోప్రా ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రాంతీయ భాషల సినిమాలు ఒకప్పుడు పరిమిత ప్రాంతాల్లో మాత్రమే ఆదరణ పొందేవని, ఇప్పుడు మంచి కథ ఉన్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ప్రియాంక పేర్కొన్నారు. అదే సమయంలో ‘వారణాసి’ చిత్రాన్ని దాదాపు 20 భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!