

‘కాంతార’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’. ఈ సినిమాలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరనారి బెలవాడి మల్లమ్మ పాత్రను పోషించనున్నారు.
ఈ సినిమాలో భాగం కావడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు భూమి పెడ్నేకర్ తెలిపారు. ‘కాంతార’లో రిషబ్ శెట్టి నటన తనను ఆకట్టుకుందని, దర్శకుడు సందీప్ సింగ్ కథ చెప్పగానే ఈ పాత్రకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్గా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సందీప్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!