
గాసిప్స్

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘జార్జ్ క్రిష్’ షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్లో ఓపెనింగ్ సీన్స్ చిత్రీకరించనుండగా, ఆగస్టు నాలుగో వారంలో జరిగే రెండో షెడ్యూల్లో హీరో–హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఇటీవల గోపీచంద్తో చేసిన ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో శ్రీను వైట్ల ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!