

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2026 నామినేషన్లను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 2025లో విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు సంబంధించిన వివిధ విభాగాల నామినేషన్లు వెల్లడించగా, విజేతలకు సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరిగే సైమా అవార్డుల వేడుకలో పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
తెలుగు విభాగంలో కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ ఏకంగా 11 నామినేషన్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఈ ఏడాది అవార్డుల రేసులో ముందంజలో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ 10 నామినేషన్లతో రెండో స్థానంలో నిలవగా, నాగచైతన్య నటించిన ‘తండేల్’ మరియు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘కోర్ట్’ చిత్రాలు చెరో 9 నామినేషన్లు దక్కించుకుని పోటీలో నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!