
సినిమాలు

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా నటించిన 'అనకాపల్లి' చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నటుడు సోనూ సూద్ చిత్రబృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ట్రైలర్లో కనిపించిన రా రియలిస్టిక్ టచ్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని సోనూ సూద్ అన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తేనే ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ పరిచయమవుతుందని పేర్కొన్నారు. అలాగే 'అనకాపల్లి' చిత్రాన్ని రూ.100 కోట్ల విజయంగా మార్చే బాధ్యత ప్రేక్షకులదేనని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!