

దర్శకురాలు సుధా కొంగర తన దర్శకత్వంలో రూపొందిన ‘పరాశక్తి’ సినిమా పారితోషికం చెల్లింపుల విషయంలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనకు చెల్లించాల్సిన మొత్తం రూ.17.70 కోట్లలో రూ.9.31 కోట్లు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.8.39 కోట్లు బకాయిగా ఉన్నాయని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రకటించినప్పటికీ, నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులను కారణంగా చూపుతూ మిగిలిన పారితోషికాన్ని చెల్లించడం లేదని వాదించారు.
అదే నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ మరో చిత్రం ‘ఇదయం మురళి’ విడుదలకు సిద్ధమవుతోందని, సుధా కొంగరకు పూర్తి పారితోషికం చెల్లించే వరకు ఆ సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని మద్రాసు హైకోర్టు డాన్ పిక్చర్స్ను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ‘పరాశక్తి’ సినిమాను శాటిలైట్లో విడుదల చేయవద్దని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!