

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన దేవిశ్రీప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ‘ఖడ్గం’ చిత్రంలోని ‘నువ్వు నువ్వు’ పాట రూపకల్పనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పట్లో ‘ఖడ్గం’, ‘మన్మధుడు’, ‘తొట్టి గ్యాంగ్’ చిత్రాలకు ఒకేసారి పనిచేస్తున్నానని చెప్పారు. ‘ఖడ్గం’ కోసం ఓ పాటను త్వరగా చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు కృష్ణవంశీ కోరడంతో, పాటను వీలైనంత త్వరగా అందించేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.
అదే రోజు రాత్రి 12 గంటలకు పని ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటలకే ‘నువ్వు నువ్వు’ పాటను పూర్తి చేశానని దేవిశ్రీప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తనకు సొంత స్టూడియో, అసిస్టెంట్లు కూడా లేరని చెప్పారు. అయినప్పటికీ నాలుగు గంటల్లో పాటను సిద్ధం చేసి సీడీ ద్వారా కృష్ణవంశీకి పంపించానన్నారు. పాట విన్న అనంతరం కృష్ణవంశీ ఫోన్ చేసి, ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి పాట ఇచ్చావంటూ ప్రశంసించారని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!