

కోలీవుడ్లో ప్రస్తుతం నటి త్రిష పేరు మరోసారి హాట్టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసు నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించిన అనంతరం బెయిల్పై విడుదల చేశారు. తాజాగా ఈ వివాదంపై త్రిష నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఇన్స్టాగ్రామ్లో వ్యంగ్యంగా స్పందించారు. ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటని, డబ్బు సంపాదించి మనశ్శాంతిగా ఉండాలని సూచిస్తూ పోస్ట్ చేశారు.
అయితే త్రిష ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఉదయనిధికే త్రిష కౌంటర్ ఇచ్చారని భావిస్తుండగా, మరికొందరు విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సంగీత తన విడాకుల కేసును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. మరోవైపు, ఉదయనిధిని పోలీసులు ఈ కేసులో విచారించగా, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!